కవి, రచయిత, జర్నలిస్టు కె.హరనాథ్‌. 37 ఏళ్ళుగా పలు కవితా సంపుటాలు వెలువరిస్తున్నారు. హైపారస (హైదరాబాద్‌ పాతనగర రచయితల సంఘం) ప్రచురించిన ఆయన 38కవితల తాజా సంకలనమిది. అందమైన అనుభూతుల్ని, తీయని మకరందాన్ని ఎలా జుర్రుకోవాలో, ఆత్మీయ స్పర్శ ఎలా ఉంటుందో, మేఘాల మేలిముసుగుల దొంతర్లు చీల్చుకుంటూ పుట్టే మెరుపుతీగల ప్రతిధ్వనుల పలకరింపులూ, పులకరింపులు, నిజమైన మట్టిమనిషి ఆవేదనలు ఎలా ఉంటాయో చాటిచెప్పే కవితలే ఇవన్నీ.

 

మోంబత్తి
కవితా సంపుటి
కె.హరనాథ్‌
ధర 100 రూపాయలు
పేజీలు 80
ప్రతులకు ప్రజాశక్తి, నవచేతన బుక్‌హౌస్‌లు, నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌