సాహితీ ప్రపంచంలో విలక్షణమైన రచయితగా చెరగని ముద్ర వేసుకున్నారు అలెగ్జాండర్ డ్యుమా. ఆయన కలం నుంచి ఉద్భవించిన ఎన్నో నవలలు సినిమాలుగా రూపొందాయి. పాఠకులకు విలక్షణతను రుచి చూపించాయి. వాటిల్లో ‘ద త్రీ మస్కటియర్స్’ ప్రముఖమైనది. అలాగే ‘బ్లాక్ తులిప్’ నవల. దీనినే ‘నల్లని పువ్వు’గా తెలుగు పాఠకులకు పరిచయం చేశారు రచయిత కె.బి.గోపాలం. కథాగమనంలో ఎక్కడా తడబడకుండా, ఇది అనువాద రచన అనే స్పృహ కలగకుండా తెలుగీకరించారు. ఈ నవల రాజకీయ నేపథ్యంతో ప్రారంభమై, ప్రేమకథగా మారి, విలక్షణంగా ముగుస్తుంది. భావవ్యక్తీకరణలు, విలక్షణత, కథాగమనం ఈ నవల విశిష్టత. అందరూ తప్పక చదవాల్సిన నవల ఇది.
నల్లని పువ్వు(నవల)
రచన: అలెగ్జాండర్ డ్యూమా
అనువాదం: కె.బి.గోపాలం
పేజీలు: 252
ధర: 150 రూపాయలు
ప్రచురణ: క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్–44.