ప్రముఖ కవి మోహన్‌ రుషి. మనిషి మనసులో పడుతున్న వేదనే ఆయన కవిత్వం. నిత్య జీవితంలో ఒత్తిడి, గుండెల్లో చేరుతున్న బాధ అతడి కవిత్వంగా మారింది. ఇప్పటికి మూడు కవిత్వ సంపుటాలు వెలువరించారు. స్వ్కేర్‌ వన్‌ ఆయన 91కవితల తాజా సంపుటి మనిషి నిస్సహాయతకు దర్పణం పడుతుంది. స్థిరమైన నిశ్చయంతో హృదయాన్ని గడ్డకట్టించుకుని వెనక్కి చూడకుండా వెళ్ళిపోవడంకంటే కొత్త వేదన మరోటి లేదంటారాయన.  

 

స్క్వేర్ వన్‌ 
మోహన్‌ రుషి
ధర 120 రూపాయలు
పేజీలు 100
ప్రతులకు నవోదయ బుక్‌హౌస్‌, హైదరాబాద్‌ రచయిత మొబైల్‌ 8341725452