సినీ, టీవీ రంగాల్లో ప్రసిద్ధుడైన రచయిత, దర్శకనిర్మాత నాగబాల సురేష్‌కుమార్‌.  12 నంది అవార్డుల గ్రహీత, 21 సీరియల్స్‌, 736 డాక్యుమెంటరీల నిర్మాణం ఆయన ఘనత. తెలంగాణ ప్రాంత రచయితలు, సాహితీవేత్తలు, రాజకీయవేత్తలు, పోరాటయోధులు, కళాకారుల జీవిత చరత్రలను ‘తెలంగాణ మహనీయులు’పేరిట లఘుచిత్రాలుగా తీశారు. ఇప్పుడు అదే పేరుతో ఈ పుస్తకం వెలువరించారు. కొమురంభీమ్‌, ఐలమ్మ, జయశంకర్‌, వానమామలై వరదాచార్యులు, దాశరథి, ఒద్దిరాజు సోదరులు, సామల సదాశివ, కాళోజి, వట్టికోట ఆళ్వార్‌స్వామి, మగ్దూం మొహియుద్దీన్‌సహా వివిధ రంగాల ప్రముఖుల జీవితచరిత్రలు ఇందులో ఉన్నాయి.

 

తెలంగాణ మహనీయులు
నాగబాల సురేష్‌కుమార్‌
ధర 150 రూపాయలు
పేజీలు 212
ప్రతులకు రచయిత, సనత్‌నగర్‌, హైదరాబాద్‌–18 సెల్‌ 7093 093 299