కుటుంబ వారసత్వంగా కథారచయితలైన తోబుట్టువులు ఈ ముగ్గురు రచయితలూ. ఈ కథా సంకలనం టైటిల్ పెట్టింది బాపూ కావడం విశేషం. వీరిలో విజయలక్ష్మి నాలుగు దశాబ్దాలుగా 200 కథలు, 15 నవలలు రాశారు. మానవ జీవన వైచిత్రి, చారిత్రక సంస్కృతిని చాటే విజయలక్ష్మి కథలు ఎనిమిది, సామాజిక రుగ్మతల్ని చిత్రించిన సూర్యనారాయణమూర్తి కథలు ఎనిమిది, హృదయోద్వేగాల్ని మథించే మరో ఎనిమిది ప్రభాకరరావు కథలు ఇందులో ఉన్నాయి.
-లలితా త్రిపురసుందరి
అమ్మమ్మే గోదావరి
కథా సంకలనం
యర్రమిల్లి విజయలక్ష్మి,సూర్యనారాయణమూర్తి, ప్రభాకరరావు
ధర 120 రూపాయలు
పేజీలు 160
ప్రతులకు నవోదయ బుక్ హౌస్, కాచిగూడ క్రాస్రోడ్స్, హైదరాబాద్–27 మొబైల్ 9000413413