మాయలు, మంత్రాలు, కుట్రలు, కుతంత్రాలు, చిత్రవిచిత్ర జంతు సమూహాలతో, ఉత్కంఠభరిత సన్నివేశాలతో అద్భుతంగా తీర్చిదిద్దబడిన జానపద నవల ‘మహానగరం’. ఈ నవల చదువుతుంటే విఠలాచార్య సినిమాలు గుర్తురాక మానవు. సన్నివేశానికి తగిన బొమ్మలతో చిన్నపిల్లలను కూడా ఆకట్టుకునే రీతిలో రచయిత తన కల్పనా పటిమను ప్రదర్శించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.

 -లక్ష్మీ నర్మద

మహానగరం
రచయిత: ఎన్‌. మురళీధర్‌
వెల: 65 రూ.
పేజీలు: 119
ప్రచురణ, ప్రతులకు: మంచి పుస్తకం
12-13-439, వీధి నెం. 1
తార్నాక, సికింద్రాబాద్‌ - 500 017
ఫోన్‌: 94907 46614