సాహితీ సోపతి, కరీంనగర్‌ ఆధ్వర్యంలో నలిమెల భాస్కర్‌ రచనలు ‘నూరేళ్ల ఉత్తమ మలయాళ కథలు’, ‘అద్దంలో గాంధారి’, ‘తెలంగాణ పదకోశం’; జూకంటి జగన్నాథం కవితా సంపుటి ‘పస’; యం. నారాయణ శర్మ రచన ‘ఊరి దుఃఖం’ ఈ ఐదు పుస్తకాల విడుదల ఫిబ్రవరి 19 ఉ.10గం.ల నుంచి జిల్లా పరిషత మీటింగ్‌ హాల్‌, కరీంనగర్‌లో జరుగుతుంది. నగునూరి శేఖర్‌, రామాచంద్రమౌళి, పెద్దింటి అశోక్‌ కుమార్‌, బూర్ల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొంటారు. 
- సాహితీ సోపతి