హైదరాబాద్, చిక్కడపల్లి: అంతర్జాతీయ కూచిపూడి నృత్య కళాకారిణి, నృత్యగురువు, సుమతీ కౌశల్కు అవార్డు ప్రదానం జరుగనుంది. అమెరికాలో ఉంటున్న సుమతీ కౌశల్ 77వ జన్మదినోత్సవం సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్ ‘వంశీ సిల్వర్ క్రౌన్’ను 18న సాయంత్రం రవీంద్రభారతిలో సినీ దర్శకుడు డాక్టర్ కె.విశ్వనాథ్ చేతులమీదుగా ఆమెకు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా అమెరికా నుంచి ఆవిడ శిష్యురాండ్లు శ్వేతారావు, వి.సౌమ్యశ్రీ, అతిథి చిత్రె, అశ్విని భూపతిరాజు, అలేఖ్య, స్నిగ్దా మద్దుల, స్వాతీ సంగీతరావుల నృత్య ప్రదర్శన ఉంటుం దని వంశీ సంస్థ అధ్యక్షుడు వంశీ రామరాజు తెలిపారు.