తెలంగాణ సాహిత్యానికి విశిష్ట సేవ చేసిన రచయిత బోయ జంగయ్య రెండవ వర్ధంతి సభ మే 7 సా.5గం.లకు నల్లగొండలోని పెన్షనర్స్‌ భవన్‌లో జరుగుతుంది. బెల్లియాదయ్య అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గుండె డప్పు కనకయ్య. విశిష్ట అతిథులు పసునూరి రవీందర్‌, స్కైబాబ, నోముల సత్యనారాయణ, వేముల ఎల్లయ్య, పగడాల నాగేందర్‌, ఎం. వెంకట్‌ తదితరులు.

- దున్న యాదగిరి