విశాఖలో మే 18న చందు సాహిత్య పురస్కారం
చందు సుబ్బారావు సాహితీ సాంస్కృతిక ట్రస్ట్ ఏటా ఇచ్చే సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాదికి కొలకలూరి ఇనాక్కు ప్రదానం చేయాలని నిర్ణయిం చారు. పురస్కార ప్రదానసభ మే 18 సా.6గం.లకు విశాఖపట్నం ద్వారకానగర్లోని విశాఖపట్నం పౌరగ్రంథాలయంలో జరుగుతుంది. కె.ఎస్. చలం, జి.నాగేశ్వరరావు, చందు సుబ్బారావు, ఎల్.ఆర్. స్వామి తదితరులు పాల్గొంటారు.
- ఉప్పల అప్పలరాజు