అనంతపురంలో ఏప్రిల్ 24న దేవపుత్ర సాహిత్య పురస్కారం
కథా నవలా రచయిత చిలుకూరి దేవపుత్ర జయంతి ఏప్రిల్ 24న ఆయన పేరిట ప్రతి ఏడాది ఒక రచయితకు సాహిత్య పురస్కారం అందజేయాలని కుటుంబ సభ్యులం నిర్ణయించాం. 2018 సంవత్సరానికిగానూ ఈ పురస్కారానికి జి. వెంకట కృష్ణను జ్యూరీ కమిటీ సభ్యులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, శాంతినారాయణ, బండి నారాయణ స్వామి, బాల సుబ్రహ్మణ్యం ఎంపిక చేశారు. ఈ పురస్కార ప్రదానం ఏప్రిల్ 22న అనంతపురంలో జరుగుతుంది.
- చిలుకూరి దీవెన