గుంటూరు (విద్య), సెప్టెంబరు 19 : ప్రపంచాన్ని శాంతివైపు మళ్లించాలనే సంకల్పంతో గురువారం నుంచి గుంటూరులో అంతర్జాతీయ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కళాశాల ఆంగ్ల అధ్యాపకుడు, కో ఆర్డినేటర్‌ పరుచూరి గోపిచంద్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జేకేసీ కళాశాలలో గత పదేళ్లుగా అంతర్జాతీయ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే సమ్మేళనంలో థాయ్‌లాండ్‌, మలేషియా, అమెరికా, యూఏఈ, శ్రీలంక, జర్మనీ, ఉజ్బెకిస్తాన్‌, ఈజిప్ట్‌ దేశాలకు చెందిన 120 మంది ప్రముఖ కవులు పాల్గొంటారని తెలిపారు.