గుంటూరు, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): గుర్రం జాషువా జయంతి వారోత్సవాలను ఈ నెల 22 నుంచి 28 వరకు గుంటూరులో నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ పేర్కొన్నారు. జాషువా జయంతి తొలిసారిగా రాష్ట్ర వేడుకగా గుర్తింపు పొందిందని ఆయన తెలిపారు. జాషువా పద్యానికి పట్టాభిషేకం పేరుతో వారం రోజులపాటు చర్చా వేదికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా 28న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో దళిత్‌ లిటరసీ పేరుతో సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుతో పాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వారోత్సవాల పోస్టర్‌ను ఆదివారం గుంటూరులో ఆవిష్కరించారు.