ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వార్షిక సదస్సు ఫిబ్రవరి 18, 19 తేదీల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. సదస్సు ప్రధానాంశం ‘వర్తమాన భారతీయ సమాజంలో దళిత మహిళ - తెలుగు సాహిత్యం’. 18వ తేదీ ఉ.10గం.లకు మొదలై రెండు రోజులు జరిగే ఆరు సమావేశాలకు వరుసగా కాత్యాయనీ విద్మహే, అనిశెట్టి రజిత, మల్లీశ్వరి, పి.రాజ్యలక్ష్మి, భండారువిజయ, కె.రామకృష్ణ అధ్యక్షతవహిస్తారు. సమావేశాల్లో కె.రామకృష్ణ, పుట్ల హేమలత, అనురాధ బెల్లపు, జాజుల గౌరి, వి. శాంతి ప్రబోధ, మందవరపు హైమవతి, మెర్సీ మార్గరెట్‌, గీతాంజలి, కె. రామలక్ష్మి, నల్లూరి రుక్మిణి, కట్టా కవిత, అరుణ గోగులమండ, తదితరులు పాల్గొంటారు. 
- ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక