హైదరాబాద్లో ఆగస్టు 2న పింగళి వెంకయ్య జయంతి
రాంనగర్/హైదరాబాద్: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 140వ జయంతి ఉత్సవాన్ని బుధవారం (ఆగస్టు 2వ తేదీ) రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఢిల్లీలో కూడా నిర్వహిస్తున్నట్టు శ్రీపింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కెహెచ్ఎస్ జగదాంబ వెల్లడించారు. హైదరాబాద్, రాంనగర్ గుండు సమీపంలోని ఇంటి నంబరు: 1-9-265/9 వద్ద ఆ ఉత్సవం నిర్వహిస్తామని సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె తెలిపారు.