2015, 2016 సంవత్సరాలకు గాను ‘రమణ సుమన శ్రీ’ ఫౌండేషన్ అవార్డులు ప్రకటించబడ్డాయి. 2015 సంవత్స రానికి సౌభాగ్య (‘సౌభాగ్య సమగ్ర కవిత్వం’), దెంచనాల శ్రీనివాస్ (‘భస్మ సారంగి’); 2016 సంవత్సరానికి సిద్ధార్థ (‘బొమ్మలబాయి’), ఎం.ఎస్. నాయుడు (‘గాలి అద్దం’) ఎంపికయ్యారు. పురస్కార ప్రదానోత్సవం జనవరి 18న సా.6గం.లకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సెమినార్ హాల్ (ఫస్ట్ ఫ్లోర్), నాంపల్లి, హైదరాబాద్ నందు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి శివారెడ్డి, చినవీర భద్రుడు, నున్నానరేష్, కె.బి.లక్ష్మి, సి.వి.కృష్ణారెడ్డి తదితరులు హాజరవుతారు.
వివరాలకు: 98491 98548
- సుమనశ్రీ