తెలంగాణ సాహితి రెండు రోజులు కార్యశాల సెప్టెంబర్‌ 23, 24 తేదీల్లో గౌరీ లంకేశ్‌ ప్రాంగణం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. సెప్టెంబర్‌ 23న ఉ.11గం.లకు ప్రారంభ సభను కె.శ్రీనివాస్‌ ప్రారంభిస్తారు. రెండు రోజుల సభల్లో ‘కవిత్వం-నేటి కర్తవ్యం’, ‘కథ-ప్రజా దృక్పథం’, ‘సాహిత్య రంగంలో నిర్మాణం-కర్తవ్యాలు’ అంశాలపై ప్రసంగాలు ఉం టాయి. సభలలో ఆనందాచారి, కె.శివారెడ్డి, యాకూబ్‌, మెర్సీ మార్గరెట్‌, తంగిరాల, సీతారామ్‌, పెద్దింటి అశోక్‌ కుమార్‌, గుడిపాటి తదితరులు పాల్గొంటారు.

- తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ