హైదరాబాద్లో మార్చి 11న దర్శకులు కోదండరామిరెడ్డి, గోపాల్కు సత్కారం
హైదరాబాద్, ఫిబ్రవరి 15: ప్రముఖ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్లకు గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళా పరిషత జీవన సాఫల్య పురస్కారాలు అందజేయనున్నట్టు సంస్థ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాస్ చౌదరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 11న పాలకొల్లులో కార్యక్రమంలోఈ పురస్కారాలు అందజేయనున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అదేరోజు జాతీయ నాటకోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.