హైదరాబాద్లో జనవరి 16న సుశీలా నారాయణరెడ్డి పురస్కారం
రసమయి సంస్థ ఈ ఏడాది 34వ సుశీలా నారాయణరెడ్డి పురస్కారానికి రచయిత్రి జలంధరను ఎంపిక చేసింది. ఈ నెల 16న సా.6గంటలకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే వేడుకలో ఈ పురస్కార ప్రదానం జరుగుతుంది. యాభైవేల నగదు, జ్ఞాపికతో సత్కారం ఉంటుంది. గవర్నర్ రోశయ్య, సి. నారాయణరెడ్డి, కె.వి. రమణాచారి తదితరులు ఈ సభలో పాల్గొంటారు.
- ఎం.కె.రాము