హైదరాబాద్లో అక్టోబర్ 21న తాడి నాగమ్మ కథలు, రచనల ఆవిష్కరణ
తొలి తెలుగు దళితకథాయిత్రి తాడి నాగమ్మ కథలు, రచనలు పుస్తకావిష్కరణసభ అక్టోబర్ 21 సా.5గం.లకు హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరుగుతుంది. ఆవిష్కర్త ఘంటా చక్రపాణి, ముఖ్య అతిథి ఎస్వీ సత్యనారాయణ. సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే సభలో నంబూరి పరిపూర్ణ, బి. విజయభారతి, కాత్యాయని విద్మహే తదితరులు ఆత్మీయ అతిథులుగా పాల్గొంటారు.
- సంగిశెట్టి శ్రీనివాస్