అమరావతి 14-01-2018: టీఎస్సార్ కాకతీయ లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 17న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ‘కాకతీయ కళావైభవ మహోత్సవం’ నిర్వహించనున్నట్టు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి(టీఎస్సార్) తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు చేతుల మీదుగా ఆ రోజు సాయంత్రం 5గంటలకు ప్రారంభమయ్యే వేడుకలో సినీనటుడు మంచు మోహన్బాబును ‘విశ్వనట సార్వభౌమ’ బిరుదుతో సత్కరిస్తామని వివరించారు.ఈ కార్యక్రమం అనంతరం ప్రతి రెండు, మూడు నెలలకోసారి తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్నగర్ తదితర ప్రాంతాల్లో కాకతీయ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. సినీ నటుడు మోహన్బాబు మాట్లాడుతూ కళాకారులను, కళలను గౌరవించే వ్యక్తుల్లో టీఎస్సార్ ముందుంటారని అన్నారు.