సిద్ధిపేటలో మార్చి 30న సాహిత్య పురస్కారాలు
జాతీయ సాహిత్య పరిషత్, సిద్ధిపేట ప్రతి ఏటా ఇచ్చే సాహిత్య పురస్కారాల్ని 31వ వార్షికోత్సవం సందర్భంగా మార్చి 30న సిద్ధిపేట ప్రెస్క్లబ్ నందు జరిగే సభలో ఇవ్వనున్నది. ఈ సభలో ఐతా భారతీ చంద్రయ్య సంప్రదాయ కథా పురస్కారాన్ని బి.వి.ఎన్ స్వామి, తడకమడ్ల సంప్రదాయ సాహితీ పురస్కారాన్ని కటుకోజ్వల ఆనందం, సంటి అనీల్ కుమార్ బాల సాహితీ పురస్కారాన్ని పైడిమర్రి రామ కృష్ణ, గాడేపల్లి వెంకటమ్మ - వీరయ్య స్మారక యువ సాహిత్య పురస్కారాన్ని మెరుగు ప్రవీణ్ కుమార్ అందుకొంటారు. వీరిని సాహిత్య పరిషత్ అధ్యక్షులు కసిరెడ్డి వెంకటరెడ్డి సత్కరిస్తారు.
- ఉండ్రాల రాజేశం