విజయవాడలో ఏప్రిల్ 22న ‘యాతన’ నవల
మల్లెతీగ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో శ్రీరామకవచం సాగర్ రాసిన ‘యాతన’ నవల ఆవిష్కరణ సభ ఏప్రిల్ 22 ఉ.10గం.లకు విజయవాడ బందరురోడ్లో గల ఠాకూర్ స్మారక గ్రంథాలయం హాలులో జరుగుతుంది. ఆవిష్కర్త చిన్ని నారాయణ రావు. ఇదే వేదికపై మల్లెతీగ కార్టూన్ పోటీ విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బాలి, బండారు హనుమంతరావు, ఇండ్ల రామసుబ్బారెడ్డి పాల్గొంటారు.
- కలిమిశ్రీ