హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: కె.ఎన్‌.వై. పతంజలి పేరు మీద ఏర్పాటు చేసిన సాహితీ పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి, పాత్రికేయుడు దేవిప్రియ స్వీకరిస్తారు. మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ పురస్కారం మొదట మోహన్‌, తరువాత జి.ఆర్‌. మహర్షి స్వీకరించారు. పతంజలి జయంతి నాడు మార్చి 29న ఉ.11గం.లకు స్థానిక జిల్లా పరిషత సమావేశ మందిరంలో దేవిప్రియకు ఈ పురస్కారం అందజేయడం జరుగుతుంది. 
- జి.ఎస్‌. చలం