చిక్కడపల్లి, సెప్టెంబర్‌22(ఆంధ్రజ్యోతి): వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌, త్యాగరాయగానసభ, ఘంటసాల ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌(గిఫ్ట్‌) ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు జయంతి ఉత్సవాల సందర్భంగా అక్కినేని చలనచిత్ర వారోత్సవాలు(దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించినవి), సినీ దర్శకులకు అక్కినేని- వంశీ పురస్కారం ప్రదానం కార్యక్రమాలు శనివారం గానసభలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, నందం హరిశ్చంద్రరావులను ప్రముఖ గాయని ఆకునూరి శారద(అమెరికా), వంశీ సంస్థల అధినేత డా. వంశీ రామరాజు సన్మానించి అక్కినేని - వంశీ పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సుంకరపల్లి శైలజ, యలవర్తి రాజేంద్రప్రసాద్‌, కళా జనార్దనమూర్తి,తెన్నేటి సుధాదేవి తదితరులు పాల్గొన్నారు.