హైదరాబాద్, 20-09-2018: అక్కినేని నాగేశ్వరరావు జీవితం ఆదర్శనీయమని, నటనలో ఆయనకు ఆయనే సాటి అని తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీప్రసాద్‌ అన్నారు. బుధవారం రవీంద్రభారతిలో తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శృతిలయ ఆర్ట్స్‌ అభినందనలతో ఆదర్శఫౌండేషన్‌ - సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో అక్కినేని జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కినేని ఫిలిం మీడియా అవార్డులను అందజేశారు. ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ జర్నలిస్టులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవీప్రసాద్‌తో పాటు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి హాజరై పురస్కారగ్రహీతలను అభినందించారు. అక్కినేని జయంతి వేడుకల సందర్భంగా మీడియా మిత్రులకు అవార్డులు అందజేయడం అభినందనీయమని నందిని సిధారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బండారు సుబ్బారావు, జేబీ రాజు, వై.కె.నాగేశ్వరరావు, ఆర్‌,ఎన్‌.సింగ్‌, మహ్మద్‌ రఫి తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు ప్రముఖ గాయనీ ఆమని నేతృత్వంలో ‘నా పాట నీనోట పలకాల చిలకా’ శీర్షికన అక్కినేని సినీ గీతాలాపన చేశారు. వెంకట్రావు, సుభాష్‌, తదితరు లు అక్కినేని సినీ పాటలను పాడారు.