పంజాగుట్ట/హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సాహిత్యానికి నిజమైన నిర్వచనం ఇచ్చిన రచయిత, ప్రముఖ కవి, పరిశోధకుడు, ఓయూ ప్రొఫెసర్ ననుమాసస్వామి అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. శుక్రవారం సోమాజీగూడలో ప్రొ.ననుమాసస్వామి (నమామి) నమామి సృజన రచనలు-సమగ్ర పరిశీలన అనే అంశంపై అధ్యాపకులు డాక్టర్ పాలమూరి విక్రమ్ సిద్ధాంత గ్రంథం సమర్పించి పీహెచ్డీ పట్టా పొందిన సందర్భంగా పుస్తకాన్ని అల్లం నారాయణ, తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్, నమామి, హైకోర్టు న్యాయవాది విజయ్కుమార్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యమాల నుంచి సాహిత్యం, కళాకారులు ఉద్భవించారన్నారు. కార్యక్రమంలో ఉదయశ్రీ ప్రచురణల అధినేత ననుమాస సుభా్షకుమార్, ఉదయశ్రీతో పాటు పలువురు పాల్గొన్నారు.