కమలాపూర్‌(వరంగల్),ఆగస్టు14: మండలకేంద్రంలోని కమలాపూర్‌ కమ్యూనిటీహాల్‌లో మంగళవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సోదరుడు డాక్టర్‌ ఈటల సమ్మన్న రచించిన అమృతతత్వం పుస్తకావిష్కరణ చేసారు. డాక్టర్‌ ఈటల సమ్మన్న రచించిన పుస్తకాన్ని తన తండ్రి ఈటల మల్లయ్య చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఇప్పటి వరకు డాక్టర్‌ సమ్మన్న ఐదు పుస్తకాలను రచించారు. సమ్మన్న రచించిన అక్షరహారతి వర్డ్‌ ఆఫరింగ్‌ పేరుతో ఆంగ్లం లో, మరో రచన సిరిమువ్వలు కన్నడం భాషలోకి అనువాదం చేశారు. కార్యక్రమంలో కమలాపూర్‌ ఎడ్యుకేషనల్‌ చారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు సిరిమళ్ల వెంకటనారాయణ, చైర్మన్‌ డాక్టర్‌ ఈటల సమ్మన్న, మేనేజింగ్‌ ట్రస్టీ సాంబయ్య,సింగల్‌ విండో చైర్మన్‌ సంపత్‌రావు, ఈటల భద్రయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రమే్‌ష, శంకర్‌, అరవింద్‌,  మల్లికార్జున్‌, సహాదేవ్‌, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.