వనస్థలిపురం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య సంకీర్తనలు  సమాజ సన్మార్గానికి దిక్సూచిలా నిలుస్తాయని బీసీ కమిషన్‌ సీనియర్‌ సభ్యులు డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ అన్నారు. సచ్చిదానంద కళాపీఠం, సుస్వర మ్యూజిక్‌ అకాడమీ నిర్వహణలో వనస్థలిపురం, సచివాలయనగర్‌ కాలనీలోని వేంకటేశ్వర స్వామి కళావేదికలో నిర్వహించిన అన్నమయ్య పద సౌరభాలు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. శంభుని మయూరి బృందం అన్నమయ్య కీర్తనలు అలరించాయి. శంభుని మయూరి సేవల్ని కొనియాడి, గాయకులను సన్మానించారు. మెరుగైన సమాజ నిర్మాణంలో అన్నమయ్య పాత్ర కీలకమన్నారు.