హైదరాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఈ నెల16వ తేదీన గన్నవరం లలిత్‌ ఆదిత్య.. సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్రభారతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, సీపీఆర్వో జ్వాలా నర్సింహారావు, సంస్కృత శతావధాని డి. ప్రభాకరశర్మ, జీఎం రామశర్మ, నరేంద్రకాప్రే, ఆయాచితం నటేశ్వర శర్మ పాల్గొంటారని అవధాన సమన్వయ కర్త దత్తాత్రేయ శర్మ, నిర్వాహకులు వెంకటరమణ శర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.