ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘సితారే జమీన్పర్’
రాయదుర్గం, నవంబర్11(ఆంధ్రజ్యోతి): ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ తన మధురమైన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం సాయంత్రం హార్ట్ఫుల్నెస్ స్వచ్ఛంద సంస్థ బ్రైటర్ మైండ్స్ (అద్భుతమైన విజ్ఞానం కలిగిన పిల్లల్లోని తెలితేటలను ఇతర పిల్లలకు, తల్లిదండ్రులకు తెలియజేస్తూ) వారిలో మెడిటేషన్ ద్వారా మేఽధోశక్తిని పెంపొందించుకునేందుకు ప్రోత్సహించే ఉద్ధేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 30 వేల మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ మహదేవన్ సంగీత కార్యక్రమాలతో పాటు పలువురు పిల్లలు తమ కళ్లకు గంతలు కట్టుకొని చేసిన ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ఐటీ సెక్రేటరీ జయేష్ రంజన్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.