యార్లగడ్డకు త్రిభాషా ప్రవీణ విశిష్ట పురస్కారం
తెనాలి: ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కు త్రిభాషా ప్రవీణ విశిష్ట పురస్కారం లభించింది. గుంటూరు జిల్లా తెనాలిలో బుధవారం పావులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. కాగా, ట్రస్ట్ ఆదర్శ దంపతుల పురస్కారం గుడివాడ ఎఎన్ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ యేర్నేని వెంకటేశ్వరరావు, సరోజిని దంపతులకు అందించారు.