ఆంధ్రజ్యోతి, హైదరాబాద్సిటీ: తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత డాక్టర్ సి.నారాయణరెడ్డి సంస్మరణ సభ సోమవారం రాత్రి ప్రసాద్ ప్రీవ్యూ థియేటర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీఎస్ ఎంఎస్ ఐడీసీ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, ప్రసాద్ ఐమాక్స్ అధినేత రమేశ్ప్రసాద్, ఖైరతాబాద్ నియోజకవర్గ తెరాస ఇన్ఛార్జి మన్నె గోవర్థన రెడ్డి, నారాయణరెడ్డి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీ చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ సినారెతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. పరుచూరి సోదరులు మాట్లాడుతూ ‘ఇద్దరు గొప్ప వ్యక్తులు.. దాసరి, సినారె మన మధ్య లేకపోవడం బాధాకరం. సినారే అధ్యక్షతనే మా రఘుబాబు నాటకోత్సవాలు జరిగేవి. ఇకపై ఆ ఉత్సవాల్లో ఆయన పేరిట ఉత్తమ రచయితకు అవార్డ్ అందిస్తాం. తెలుగు అక్షరం ఉన్నంతకాలం సినారె మన మధ్యనే ఉంటారు’ అని అన్నారు. టి. ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ సాయివెంకట్ మాట్లాడుతూ ‘సినారె పాటలంటే ఎంతో ఇష్టమన్నారు.