హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: ప్రముఖ సినీ దర్శకుడు విశ్వనాథ్‌ను దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం వరించిన సందర్భంగా నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం గవర్నర్‌ నరసింహన్‌, సినీ నటులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు, మాజీ ఎంపీ కృష్టంరాజు,ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఎంపీ సుబ్బరామిరెడ్డి, సీనియర్‌ నరేష్‌, దర్శకులు శంకర్‌, తరుణ్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక  కార్యక్రమాలు అలరించాయి.