హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): దాశరథి కృష్ణమాచార్య అవార్డు 2019కి ప్రముఖ కవి కూరెళ్ల విఠలాచార్యను ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 22న దాశరథి జయంతి సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డుకు ఎంపికైనందుకు విఠలాచార్యకు రూ.1,01,116 నగదు ఇస్తామని, దీంతోపాటు ఆయనను శాలువాతో సత్కరించనున్నట్లు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఓ ప్రకటనలో తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో విఠలాచార్య జన్మించారు. పద్యం, గద్యం, బుర్రకథ, వ్యాసం, నాటకం, బాల సాహిత్యం, సాహిత్య ప్రక్రియల్లో ఆయనకు పట్టు ఉంది.