హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక దాశరథి కృష్ణమాచార్య పురస్కారానికిగాను ప్రముఖ కవి వజ్జల శివకుమార్‌ ఎంపికయ్యారు. ఈ నెల 22న దాశరథి జయంతిని పురస్కరించుకొని ఆయనకు అవార్డును ప్రదానం చేయనున్నారు. పురస్కారంకింద ప్రశం సాపత్రం, రూ.101,116 నగదు అందజేయనున్నట్లు సాంస్కృతిక శాఖ కార్యదర్శి వెంకటేశం పేర్కొన్నారు.