ఖైరతాబాద్‌, నవంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి):  ఆర్‌ఎ్‌సఎస్‌ దేశభక్తి ముసుగులో రాజకీయాలకు పాల్పడుతోందని, దాంతో పాటు ఎంఐఎం బారి నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తూ దేశభక్తి ముసుగులో.. అనే పుస్తకాన్ని పోరెడ్డి విజయ్‌శంకర్‌రెడ్డి రచించారు. ఆయన గతంలో ఆర్‌ఎ్‌సఎ్‌స్‌లో ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వహించి తప్పుకున్నారు. ఆదివారం సైఫాబాద్‌లోని సామ్రాట్‌ కాంప్లెక్స్‌లోని అంబేద్కర్‌ భవనంలో ఆయన పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయశంకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ మతపరంగా ఓట్లు అడగుతోందని, దీనికి ఆర్‌ఎ్‌సఎ్‌సను వినియోగించుకుంటోందన్నారు. సమాజాన్ని జాగృతం చేసి ఆర్‌ఎ్‌సఎస్‌ కుట్రలకు ముగింపు పలకాలనే ఉద్ధేశంతో ఈ పుస్తకాన్ని రచించానన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు మురళీ, వీరేశ్‌, ఆంజనేయులు, తదితరులు     పాల్గొన్నారు.