కవి గోపికి దాశరథి అవార్డు
హైదరాబాద్ జూలై 19(ఆంధ్రజ్యోతి): సాహిత్య రంగంలో విశేష సేవలు చేసినందుకుగాను ప్రముఖ కవి, ప్రొఫెసర్ ఎన్ గోపికి ఈ సంవత్సరానికిగాను దాశరథి కృష్ణమాచార్య అవార్డు లభించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. నల్లగొండకు చెందిన గోపి గతంలో తెలుగు యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. ఈ అవార్డు కింద ప్రభుత్వం మెమొంటోతోపాటు రూ1,01,116 నగదును అందజేయనుంది. దాశరఽథి జయంతి రోజైన ఈనెల 22న ఈ అవార్డును అందజేయనున్నారు. దాశరథి అవార్డును 2015 నుంచి సాహిత్య రంగంలో విశేష సేవలందించిన వారికి ప్రభుత్వం అందజేస్తోంది. 2015 సంవత్సరంలో డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్కు, గత సంవత్సరానికి డాక్టర్ జే బాపురెడ్డిలకు ప్రభుత్వం ఈ అవార్డును అందజేసింది.