గుంటూరు: ప్రముఖ రచయిత, సాహితీవేత్త, ఆచార్య మొదలి నాగభూషణ శర్మ కన్నుమూశారు. 1936 జూలై 24న ధూళిపూడి గ్రామంలో నాగభూషణ శర్మ జన్మించారు. నాటక, కళారంగాల్లో విశేష కృషి చేశారాయన. 2013లో నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం అందుకున్నారు నాగభూణషణ శర్మ. ఈయన మృతి గురించి తెలుసుకున్న పలువురు ప్రముఖులు, కవులు, రచయితలు సంతాపం తెలిపారు. బుధవారం తెనాలిలో నాగభూణష శర్మకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.