గాయకుడు చిప్పాడకు ఆర్థికసాయం
చిక్కడపల్లి, మే16(ఆంధ్రజ్యోతి): భీమవరానికి చెందిన గాయకుడు చిప్పాడ నాగేశ్వరరావుకు ఘంటసాల ఇంటర్నేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డా. వంశీ రామరాజు రూ.15500 ఆర్థికసాయం చేశారు. గురువారం రాత్రి త్యాగరాయగానసభలో ఘంటసాల గానగౌతమి, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఘంటసాల ఏక గళ గీతాలాపన కార్యక్రమంలో వంశీ రామరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం జరిగిన కార్యక్రమానికి త్యాగరాయగానసభ అద్దె నిమిత్తం రూ. 12500, ప్రతి నెలా చిప్పాడ నాగేశ్వరరావుకు అందిస్తున్న ఆర్థికసాయం కింద మార్చి ఏప్రిల్, మే నెలల నిమిత్తం మూడు వేలు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో చిప్పాడ నాగేశ్వరరావును పలువురు అభినందించారు.