హదరాబాద్, రవీంద్రభారతి: దాశరథి సమకాలీనుడు, అద్భుతమైన పద్యాలు రాసి గొప్ప వాళ్లను మెప్పించిన కవి వానమామలై వరదాచార్యులు తెలంగాణ వైతాళికుడు అని ప్రముఖ సాహితీవేత్త తిరుమల శ్రీనివాసాచార్య అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, భారత్‌ కల్చరల్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో వానమామలై వరదాచార్యుల 105వ జయంతి సభ రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం జరిగింది. తిరుమల శ్రీనివాసాచార్యతోపాటు ఆచార్య దేవరాజు రాంబావు, దైవజ్ఞశర్మ, ఆచార్య రావికంటి వసుదేవన్‌, ఆచార్య ఫణీంద్ర, రవీంద్రాచార్యులు తాళ్లపల్లి మురళీధర్‌, రామకృష్ణ తదితరులు పాల్గొని వరదాచార్యులుకు నివాళి అర్పించారు.