ఆంధ్ర నాట్యానికి శాస్త్రీయ హోదా!
మార్గదర్శకాలు లేక కేంద్ర కమిటీ వద్ద పెండింగ్
న్యూఢిల్లీ, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర నాట్యానికి శాస్త్రీయ హోదా అందించే అంశం పరిశీలనలో ఉందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. ఆంధ్ర నాట్యాన్ని శాస్త్రీయ నృత్యంగా గుర్తించాలని అప్పటి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు 2017 జనవరిలో ప్రతిపాదించారని, స్వరనర్తన సాంస్కృతిక సంస్థ నుంచి కూడా విజ్ఞప్తులు వచ్చాయన్నారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ అడిగిన ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీనికి మార్గదర్శకాలను రూపొందించే దశలో ఉన్నామన్నారు.