కళాకారులకు ప్రోత్సాహం: ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్ కల్చరల్, మే 18 : కళాకారులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన పేరిణి, కూచిపూడి నృత్యోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మల్లో ఆడిటోరియం ఏర్పాటు చేయడంతోపాటు, కళాకారులకు బీమా కల్పించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.