గుంటూరు, 20-09-2018: స్థానిక జేకేసీ కళాశాలలో 11వ అంతర్జాతీయ స్థాయి కవితోత్సవాలు-2018 గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలిరోజు తెలుగు రచనలపై ప్రత్యేక కార్యక్రమాలతోపాటు అధ్యాపకులు, విద్యార్థులకు కోసం ప్రత్యేక పోటీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే తెలుగు భాషపై వచ్చిన కవితల్ని పరిశీలించి ఉత్తమ కవితలకు బహుమతులు అందజేయనున్నారు. ఈ ఏడాది ప్రపంచశాంతి, పర్యావరణం, స్త్రీల సమస్యలు, మానవతా విలువలు అనే మూడు అంశాలపై ఉత్సవా లు నిర్వహిస్తారు. ఆయా అంశాలపై కవి సమ్మేళనం, చర్చలు నిర్వహిస్తున్నారు. అం తర్జాతీయ కవితోత్సవానికి హాజరయ్యేందు కు పలు దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రతినిధులు నగరానికి చేరుకున్నారు. ఈ ఏడాది జరిగే సదస్సుకు ఇప్పటికే 160 దేశాల నుం చి ప్రతినిధులు రిజిస్టర్ చేసుకున్నారు.తెలుగు రాష్ట్రాల సహా దేశవ్యాప్తంగా 250 మందికిపైగా కవులు, సాహితీవేత్తలు సదస్సులో పాల్గొని తమ రచనలు ఇక్కడ పరిచయం చేయనున్నారు. ఈ ఏడాది ఆయా అంశాలపై ఇప్పటికే రచనలు వచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు.
ఇందులో తొలిరోజు ప్రత్యేకంగా తెలుగు భాషాభివృద్ధికోసం వి ద్యార్థులు, యువత, ఉపాధ్యాయుల నుంచి కవితల్ని, రచనల్ని ఆహ్వానించి వారిని ప్రోత్సహిస్తున్నారు. మిగతా రెండు రోజులు ఆంగ్ల సాహిత్యంపై సదస్సు లు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయి లో 11 సంవత్సరాల నుంచి నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొన్న కవుల రచనలు అచ్చువేసి ప్రత్యేకం గా ఒక సావనీర్ విడుదల చేయడా నికి ప్రణాళిక సిద్ధంచేశారు. ప్రధానంగా రెండు తెలుగురాష్ట్రాలతోపాటు అమెరికా సంయుక్తరాష్ట్రాలు, శ్రీలంక, థాయిలాండ్, మలేషియా, నైజిరియా, ఉజికిస్థాన్, లండన్, ఇరాన్, ఇరాక్ తదితర దేశాల నుంచి ఆంగ్లసాహిత్యంలో నిష్ణాతులైన కవులు సదస్సులో పాల్గొంటారు. దేశ సంస్కృతి సంప్రదాలు ప్రతిబించేలా దేశంలోని ప్రాంతీయ భాషల కవులతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. సదస్సుకు సంబంధించిన బ్యానర్లను బుధవారం కన్వీనర్లు నాగసుశీల, గోపిచంద్ ఆవిష్కరించారు.