మద్రాస్ తెలుగు అకాడమీ మాజీ ఉపాధ్యక్షుడు మృతి
విశాఖపట్నం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): చెన్నైలోని మద్రాస్ తెలుగు అకాడమీ అండ్ భారతి కల్చరల్ ఇంటిగ్రేషన్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు సుంకరి ప్రభాకరరావు(82) మంగళవారం విశాఖలోని తన స్వగృహంలో కన్నుమూశారు. విశాఖలో పలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్ర నాన్గజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా, ఎన్జీవో హౌస్ బిల్డింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ అడహాక్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు.