విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత్రి, చిత్రకారిణి శివరాజు సుబ్బలక్ష్మికి 2017 మాలతీచందూర్‌ పురస్కారాన్ని అందించనున్నట్టు కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్ల లక్ష్మీప్రసాద్‌ తెలిపారు. సోమవారం విశాఖలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఆనందారామం, యద్దనపూడి సులోచనరాణి, ఆరుద్ర రామలక్ష్మికి ఈ అవార్డును అందించామని, ఈ ఏడాది శివరాజు సుబ్బలక్ష్మిని ఎంపిక చేశామన్నాశాశారు. 21న హైదరాబాద్‌లో నిర్వహించేకార్యక్రమంలో ఆమెకు అవార్డును అందిస్తామన్నారు.