పుస్తక రూపంలో ‘మన్ కీ బాత్’
న్యూఢిల్లీ, మే 25: ప్రధాని మోదీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ఇప్పుడు పుస్తకరూపంలో లభ్యమవుతోంది. ఈ పుస్తకం తొలి ప్రతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. స్పీకర్ సుమిత్ర మహాజన్ చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతిభవన్లో శుక్రవారం జరిగే కార్యక్రమంలో స్పీకర్ లాంఛనంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.