17-10-2017: తేజస్విని కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం త్యాగరాయగానసభలో ప్రజానటి, కళాభారతి జమున రమణారావుకు ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక విశిష్ట పురస్కార ప్రదానోత్సవం వైభవం గా జరిగింది. నందమూరి తారకరామారావును స్మరిస్తూ నటసార్వభౌమునికి నాదనీరాజనం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జమునను మాజీ గవర్నర్ డా. కొణిజేటి రోశయ్య సన్మానించి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడారు. అదే విధంగా పారిశ్రామికవేత్త జీఆర్ సూర్యరాజ్కు జీవితసాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్తేజ, సమాచార హక్కుచట్టం మాజీ కమిషనర్ విజయబా బు, సినీనటి గీతాంజలి, వంశీ రామరాజు, దైవజ్ఞశర్మ, ప్రముఖ గాయకులు, కార్యక్రమ నిర్వాహకులు ఎస్బీ సుధాకర్, రాణి సుధాకర్ పాల్గొన్నారు.