తెనాలి(గుంటూర్), ఆగస్టు 13: గాంధీనగర్లోని మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు గృహంలో నాయనమ్మ కథలు పుస్తకాన్ని సోమవారం ఆవిష్కరించారు. కొర్రపాటి నగరాజకుమారి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం యడ్లపాటి మాట్లాడు తూ నేటి సమాజంలో తాతయ్య, నాయనమ్మలు చెప్పే కథలు వినే పిల్లలే కరువయ్యారని అన్నారు. సంస్కృతి, సంప్రదాయా లు రాను రాను తగ్గిపోతున్నాయన్నారు. ఎస్బీఐ ఏజీఎం అనూరాధ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఈ పుస్తకాన్ని దగ్గర ఉంచుకుని కథలను పిల్లలకు వినిపించాల ని సూచించారు. బెల్లంకొండ వెంకట్, రఘునాథరావు, రత్నకుమారి, నాగేశ్వరరావు, బొల్లిముంత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.