చిక్కడపల్లి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): కూచిపూడి నృత్యనీరాజనం కార్యక్రమం నయనమనోహరంగా సాగింది. డాక్టర్‌ శోభానాయుడు శిష్యబృందం చేసిన ఈ కార్యక్రమం శనివారం రాత్రి త్యాగరాయ గానసభ కళాదీక్షితులు కళావేదికలో గానసభ ఆధ్వర్యాన నిర్వహించారు. నర్తకీమణులు సాయి శివరంజని, షర్మిల, శ్రీహిత, ఆకాంక్ష నృత్యప్రదర్శనను నిర్వహించారు. కళామతల్లి సరస్వతికి కళానీరాజనాలు అర్పించే అంశాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. అనంతరం శోభానాయుడును గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి సన్మానించారు. శోభానాయుడు మాట్లాడుతూ కళలకు పుట్టినిల్లుగా గానసభ విలసిల్లుతోందని ప్రశంసించారు. కార్యక్రమంలో గాయకుడు అమలాపురం కన్నారావు, గానసభ కమిటీ సభ్యులు ఇంగువ హైమ పాల్గొన్నారు.